ఈవీఎంల ట్యాంప‌రింగ్ శుద్ధ అబ‌ద్ధం: వైసీపీ నేత

72చూసినవారు
AP: ఈవీఎంలపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఆ పార్టీ నేత, మాజీ MLA రాపాక వరప్రసాద్ వ్యతిరేక స్వరం వినిపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది శుద్ధ అబద్ధం అని కొట్టిపారేశారు. మూడు పార్టీల ఓట్లు కలిసిపోవడంతోనే ఇలాంటి ఫలితం వచ్చింద‌ని BIG TVతో చెప్పారు. కాగా 2019లో రాపాక వరప్రసాద్ జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

సంబంధిత పోస్ట్