చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత

74చూసినవారు
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
చికెన్ షావర్మా తిని 12 మంది అస్వస్థతకు గురైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్‌నగర్‌లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండురోజుల వ్యవధిలో 12 మంది ఆస్పత్రి పాలయ్యారని అధికారులు తెలిపారు. వారిలో తొమ్మిది మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్