ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నథింగ్ రెండు కొత్త ఇయర్బడ్స్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ ఏ పేరిట వీటిని ఆవిష్కరించింది. ట్రాన్స్పరెంట్గా ఉండే ఈ ఇయర్బడ్స్ను ఆకర్షణీయమైన డిజైన్తో రూపొందించింది. ఈ ఇయర్బడ్స్.. బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తాయి. దీని ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో కేస్ను ఒకసారి ఫుల్ ఛార్జి చేస్తే 40.5 గంటల ప్లే బ్యాక్ టైమ్ ఇస్తాయి.