అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్లు మోసం

76చూసినవారు
అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్లు మోసం
హైదరాబాద్‌ అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ సంస్థ అధిక వడ్డీ ఆశ చూపి సామాన్యుల నుంచి రూ.200 కోట్ల మేర డిపాజిట్లను సేకరించింది. అందిన కాడికి దండుకుని రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్ సీసీఎస్ పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. దాదాపు 517 మంది ఇప్పటి వరకు ఈ సంస్థలో డిపాజిట్లు చేసినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్