సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం, ఎన్నికల ప్రచారకర్త సచిన్ టెండూల్కర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కుమారుడు అర్జున్ టెండూల్కర్తో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు.