శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

1152చూసినవారు
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రోజు స్వామివారిని 69,483 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,459 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ. 3.58 కోట్ల ఆదాయం వచ్చింది.

సంబంధిత పోస్ట్