గుజరాత్‌లో భారీ వర్షాలకు 28 మంది మృతి

84చూసినవారు
గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. ఆయా ఘటనల్లో మరణాల సంఖ్య 28కు చేరింది. దాదాపు 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం భూపేంద్ర పటేల్‌ను ప్రధాని మోదీ ఆరా తీశారు. అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్