మంచినీటి ట్యాంకులో పడి దాదాపు 30 కోతులు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని హిల్ కాలనీలో వెలుగు చూసింది. విజయవిహార్ సమీపంలోని 200 గృహాలకు తాగునీరు సరఫరా చేసేందుకు నీటిసరఫరా విభాగం ఓ ట్యాంకు నిర్మించి పైన రేకులు వేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్యాంకులోని నీళ్లు తాగేందుకు కోతులు ప్రయత్నించాయి. బయటకు వచ్చే దారి దొరక్క అందులోనే మృత్యువాత పడ్డాయి. అధికారులు బుధవారం గుర్తించి వానర కళేబరాలను వెలికితీశారు.