వాయు కాలుష్యానికి ఏటా 33 వేల మంది బలి

59చూసినవారు
వాయు కాలుష్యానికి ఏటా 33 వేల మంది బలి
వాయుకాలుష్యం కారణంగా భారతదేశంలో ఏటా 33వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు 'ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్' జర్నల్ పేర్కొంది. వారిలో 12వేల మంది ఢిల్లీవాసులే ఉంటున్నారని లాన్సెట్ నివేదిక పేర్కొంది. హైదరాబాద్లో 1,600 మంది చనిపోతున్నారని తెలిపింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, పూణే, ముంబై, షిమ్లా, వారణాసి నగరాల్లో రోజూ నమోదవుతున్న మరణాల్లో దాదాపు 7 శాతం మరణాలకు వాయు కాలుష్య మే కారణమని వెలడించింది.

సంబంధిత పోస్ట్