గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండలు, లోయలు సెర్చ్ ఆపరేషన్కి సంక్లిష్టంగా మారాయి. జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్, కథువా సెక్టార్లలో 35-40 మంది విదేశీ ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ మూలాలు తెలియజేస్తున్నాయి. భారత సైన్యం ఇప్పటికే 200కి పైగా సాయుధ రక్షిత వాహనాలతో కూడిన అదనపు బలగాలను మోహరించాయి.