రేపే పార్లమెంటు తొలి సమావేశాల ప్రారంభం

80చూసినవారు
రేపే పార్లమెంటు తొలి సమావేశాల ప్రారంభం
ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు దాదాపు 280 మంది లోక్‌సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్.. ఎంపీలతో ప్రమాణం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణం చేశాక ఇతరుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, 27న రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్