ప్రియురాలి సోదరుడితో కలిసి భార్యను హతమార్చిన భర్త

83చూసినవారు
ప్రియురాలి సోదరుడితో కలిసి భార్యను హతమార్చిన భర్త
రాజస్థాన్ లోని పాలి జిల్లాలో దారుణం జరిగింది. బిలారా రాష్ట్ర రహదారిపై మాండ్లా గ్రామ సమీపంలో జూన్ 19న ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మృతిచెందిన మహిళ ఉత్తరాఖండ్ నివాసి వర్షగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలు తెలుసుకున్నారు. అడ్వకేట్‌ అయిన మహిళ భర్త విశాల్‌ తన ప్రియురాలి సోదరుడితో కలిసి వర్షను కాల్చి చంపినట్లు గుర్తించారు. వివాహేతర బంధానికి అడ్డుగా ఉందనే వారు ఈ హత్య చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్