మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కాన్వాయ్లోని నాలుగు పోలీసు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన మంగళవారం జల్గావ్లోని విమానాశ్రయం సమీపంలో జరిగింది. సీఎం షిండేతో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా కాన్వాయ్లో ప్రయాణిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.