ఇంట్లో 4వేల కిలోల చెత్త.. అక్కడే తల్లీకూతుళ్ల జీవనం

73చూసినవారు
తమిళనాడులోని కోయంబత్తూరులో డంపింగ్ యార్డులా మారిన ఇంట్లోనే ఇద్దరు తల్లీకూతుళ్లు నివశిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మరణంతో మానసికంగా కుంగిపోయిన రుక్మిణి, ఆమె కుమార్తె కొన్నేళ్లుగా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. భర్త పెన్షన్ వస్తుండటంతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ తినేసిన కవర్లు, డబ్బాలను అలానే పడేసేవారు. దీంతో వారి ఫ్లాట్ లో 4వేల కిలోల చెత్త పేరుకుపోయింది. దుర్గంధం రావడంతో స్థానికులు గమనించి ఆ చెత్తను బయటకు తీయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్