పాకిస్థాన్లోని కరాచీలో ఎండలు, వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. కరాచీలో వడదెబ్బతో 4 రోజుల్లో దాదాపు 450 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కొంతమంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.