175 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. వీరిలో 81 మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఆరుగురు కొత్త సభ్యులు కాగా, ఎమ్మెల్యేలలో ఇద్దరు మాజీ ఐఏఎస్లు ఉన్నారు. శ్రీనివాస్ పేరుతో 11 మంది సభ్యులు ఉండటం విశేషం.