తమిళనాడులోని తిరుచ్చి-చెన్నై హైవేపై పాలపన్నై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న ఓమ్నీ బస్సు ప్రమాదవశాత్తు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. బస్సు లో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం నుంచి పరారైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.