మహారాష్ట్రలోని హింగోళి జిల్లా తాక్తోడలో మూడో తరగతి చదివే సాయిరామ్ కైలాస్ తన తల్లిదండ్రులపై పొలీసులకు ఫిర్యాదు చేశాడు. 'పోలీస్ అంకుల్, మా తల్లిదండ్రులు పోలింగ్ రోజున ఊరికి వెళ్తున్నారు. పోలింగ్ రోజున వారిని అరెస్ట్ చేసి ఓటు వేయడానికి తీసుకెళ్లండి. కానీ, ఓటేసిన తర్వాత మళ్లీ వదలిపెట్టండి’ అంటూ పోలీసులకు ఒక లేఖ రాశారు. బాలుడి స్ఫూర్తిని మెచ్చుకొన్న పోలీసులు రిజిస్టర్లో ఈ లేఖను నమోదు చేశారు.