తైవాన్ భూకంపం బీభత్సంతో పొరుగున ఉన్న జపాన్ కూడా అప్రమత్తమైంది. భూకంపం సంభవించిన 30 నిమిషాల తర్వాత భారీ అల జపాన్లోని యొనగుని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. అంతేకాకుండా, జపాన్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి కోస్తాతీరంలో సముద్రం అలలు 3 మీటర్ల ఎత్తువరకూ ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది. గత 26 ఏళ్లలో తొలిసారి జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.