పంజాబ్కు చెందిన ఓ జంట తమ రిటైర్మెంట్ లైఫ్ను రోడ్ ట్రిప్తో ఎంజాయ్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు ఓ చిన్నపాటి కారవాన్లో వివిధ ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. జనవరి నెలలో ప్రారంభమైన వారి ప్రయాణం నేటికి కొనసాగుతూనే ఉంది. రోడ్ ట్రిప్లో భాగంగా ఔరంగాబాద్ హైవేపై హాల్ట్ వేసి, రోడ్డు పక్కన స్వయంగా వంట చేసుకుని భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్గా మారింది.