విపక్ష పార్టీలపై మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఛార్జిషీట్లంటూ హడావిడీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. దొంగల ముఠా అంతా కలిసి సీఎం జగన్పై ప్రభుత్వంపై అభాండాలు, అవాస్తవాలు, అసత్యాలతో ఛార్జిషీట్ రూపొందించారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఏవో కుంభకోణాలు జరిగాయని విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.