విమానంలో తప్పుగా ప్రవర్తించినందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ మహిళకు భారీ జరిమానా విధించింది. 2021వ సంవత్సరంలో 34 ఏళ్ల హీథర్ వెల్స్ అనే మహిళ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో తప్పతాగి తోటి ప్రయాణికులపై దాడి చేసింది. విమానంలో అల్లకల్లోలం సృష్టించింది. దీంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 81,950డాలర్లు రూ. 68 లక్షల 46 వేలకు పైగా జరిమానా విధించింది. అయితే ఈ జరిమానాను ఆమె చెల్లించలేదు. దీంతో ఆమెపై కేసు పెట్టింది.