చలి కాచుకోవటానికి ఏకంగా ట్రైన్లో నిప్పు..?

585చూసినవారు
చలి కాచుకోవటానికి ఏకంగా ట్రైన్లో నిప్పు..?
చలి నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఏకంగా కదులుతున్న రైలులో మంట పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ రైలులో మంటలు రావడంతో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది జనరల్ భోగీలోకి వెళ్లారు. కొందరు యువకులు మంట వేసి చలికాచుకోవడంతో షాక్ కు గురయ్యారు. చందన్, దేవేంద్ర అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలీగఢ్‌లోని ఆర్‌పీఎఫ్ పీఎస్ కు తరలించారు.