ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ బీచ్ తీరం వద్ద సముద్రం ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో తీరానికి బంగారం రేణువులు కొట్టుకు వస్తున్నాయనే ప్రచారం చుట్టు గ్రామాలకు చేరింది. దీంతో ప్రజలు ఉప్పాడ్ బీచ్కు చేరుకుంటున్నారు. తీరం వెంట వెళ్తూ బంగారపు రేణువులు కోసం వెతుకుతున్నారు. గతంలో వెండి నాణేలు, బంగారం ముక్కలు దొరికాయని.. ఇప్పుడు దొరుకుతాయేమనని వెతుకున్నట్లు ప్రజలు చెప్పారు.