ఇజ్రాయెల్, గాజా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంపై భారత్ కూడా స్పందించడం ప్రారంభించింది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 28,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత నౌకాశ్రయాల నుంచి ఇజ్రాయెల్ వెళ్లే నౌకలకు సైనిక పరికరాలు, ఆయుధాలను లోడ్ చేయడం గానీ, అన్లోడ్ చేయడం కుదరదని వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ విషయాన్ని తమ ఫెడరేషన్ సభ్యులందరికీ తెలియజేశామని వెల్లడించారు.