ఐసీయూలో పనిచేయని ఏసీలు.. టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగులు

83చూసినవారు
ఐసీయూలో పనిచేయని ఏసీలు.. టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగులు
మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లోని సేత్‌ గోవింద్‌ దాస్‌ విక్టోరియా జిల్లా ఆసుపత్రిలో దయనీయ స్థితి నెలకొంది. అక్కడ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌‌లో గత కొన్ని నెలలుగా ఏసీలు పనిచేయడం లేదు. దీంతో ఉక్కపోతకు అల్లాడుతున్న రోగులు తమ ఇళ్ల నుంచి టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకొని మంచాల చెంతన ఏర్పాటు చేసుకుంటున్నారు. స్థానిక మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. బడ్జెట్‌ లేకపోవడమే ఇందుకు కారణమని వారు పేర్కొనడం గమనార్హం.

సంబంధిత పోస్ట్