అమెరికాలోని మిస్సోరిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాన్సాస్ సిటీలో నివసిస్తున్న మరియా థామస్ తన నవజాత శిశువును చంపినట్లు పోలీసులు సమాచారం అందింది. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. బాలుడికి పాలు పట్టించిన తర్వాత ఊయలలో పడుకోబెట్టాలని, తెల్లవారుజామున చూసే సరికి బిడ్డను ఓవెన్లో పడుకోబెట్టినట్లు అర్థమైందని ఆమె చెప్పింది. కాలిపోయి, ఊపిరాడక చిన్నారి మృతి చెందింది.