ఇక నుంచి తీన్మార్ మల్లన్నలో కొత్త యాంగిల్ చూస్తారన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు ఉమ్మడి వరంగల్ ,ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న( చింతపండు నవీన్ కుమార్). అనంతరం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తో ఫోటో సెషన్లో పాల్గొన్నారు మల్లన్న.