గత నెల 23న బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ జంట వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట హనీమూన్ ట్రిప్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది. నూతన దంపతులు స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతూ హనీమూన్ ను ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోనాక్షి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి. కాగా ముంబైలో జరిగిన వీరి వివాహానికి సినీతారలు, సెలబ్రిటీలు పెద్దఎత్తున హాజరయ్యారు.