బిహార్ లోని నవాడాకు చెందిన సంతోష్ లోహర్ రైల్వే ట్రాక్ పనులు చేస్తున్నాడు. ఇటీవల తన పనిని ముగించికుని బేస్ క్యాంపులో నిద్రిస్తుండగా అతడిని ఓ పాము కాటు వేసింది. అదే పామును తిరిగి కొరికేస్తే దాని విషం తగ్గిపోతుందనే మూఢనమ్మకంతో ఆ పామును రెండు సార్లు కొరికాడు. అతడి పంటి గాయానికి సదరు పాము చచ్చిపోయింది. సహచరులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు.