దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై ఏర్పడిన గుంత.. ఎలుకల వల్లేనని చెప్పిన ఉద్యోగిపై వేటు

66చూసినవారు
దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై ఏర్పడిన గుంత.. ఎలుకల వల్లేనని చెప్పిన ఉద్యోగిపై వేటు
నిర్లక్ష్య సమాధానం చెప్పిన ఓ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు అధికారులు. రాజస్థాన్ దౌసా జిల్లాలో దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మధ్యలో గుంత ఏర్పడింది. అయితే ఎలుకల వల్లే ఈ గుంత ఏర్పడిందని చెప్పడంతో.. ఆ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో బాగమైన ఉద్యోగిని కంపెనీ తొలగించినట్టు తెలుస్తోంది. అతనికి ప్రాజెక్ట్ కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం లేదని, అందుకే ఉద్యోగం నుంచి తీసివేశామని సదరు సంస్థ NHAIకి రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. నీటి లీకేజీతో రంధ్రం ఏర్పడిందని అధికారులు వివరించారు.

సంబంధిత పోస్ట్