నేడు హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం

74చూసినవారు
నేడు హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం
దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతుంది. నేడు(మంగళవారం) సియోల్ లోని హాన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను మంత్రుల బృందం సందర్శించనుంది. సియోల్ నగరంలో నీటి సరఫరాతో పాటు పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న హాన్ నదిని పరిశీలించనున్నారు. కాలుష్యానికి గురైన హాన్ నదిని దక్షిణ కొరియా ప్రభుత్వం శుభ్రపరచి, పునరుద్ధరించింది. మూసీ నది పునరుజ్జీవం కోసం ఈ అధ్యయన యాత్రను మంత్రులు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్