తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

73చూసినవారు
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 64,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 23,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్