ఇద్దరు విద్యార్థినులపై సామూహిక అత్యాచారం

81చూసినవారు
ఇద్దరు విద్యార్థినులపై సామూహిక అత్యాచారం
ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు విద్యార్థినులపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పట్టణానికి చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు, ముగ్గురు యువకులు స్నేహితులు. ఈ నెల 19 వారిలో ఒక యువకుడి పుట్టిన రోజు కావడంతో పార్టీ చేసుకున్నారు. వేడుకల్లో యువకులు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక యువతి తప్పించుకుంది. బాధిత యువతిలో ఒకరు అనారోగ్యం బారిన పడటంతో అసలు విషయం ఆలస్యంగా బయటపడింది.

సంబంధిత పోస్ట్