పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లోని ముజఫర్గఢ్ జిల్లాలో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకెళ్లిన ట్రక్కు అదుపు తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను అది ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 13 మంది చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడడించారు. ముల్తాన్లోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.