బంగ్లాదేశ్లో బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. ఢాకా వెళ్తున్న జమున ఎక్స్ప్రెస్ తేజ్గావ్ ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు ఢాకా రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఫెర్దౌస్ అహ్మద్ బిస్వాస్ మీడియాకు వెల్లడించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అయితే రాళ్ల రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.