ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ఎక్స్టెన్షన్లో ఓ విషాద ఘటన జరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్లోని ఎత్తైన భవనంపై నుండి దూకి పనిమనిషిగా పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం వివిఐపి హోమ్స్ సొసైటీలో జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.