టీడీపీ వాళ్లని చూసి నేర్చుకోవాలని.. వాళ్లను ఫాల్ అవ్వండంటూ జనసేన నాయకులకు అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురంలో ప్రతి ఓటర్ తో ఫోటో దిగుతానని తెలిపారు. రోజుకు 200 మంది ఓటర్లలో పిఠాపురం నియోజకవర్గంలోని అందరితో ఫోటో దిగుతానని క్లారిటీ ఇచ్చారు. పిఠాపురంలో మెజారిటీ ఎంత రావాలనేది జనసేన నేతలకే వదిలేస్తున్నానంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.