ఢిల్లీకి BJP హర్యానా ప్రభుత్వం ద్వారా నీటిని ఆపేసిందని మంత్రి అతిషి ఆరోపించడంపై BJP స్పందించింది. లోక్సభ ఎన్నికల్లో AAPకి ఓటమి భయం పట్టుకుందని ఢిల్లీ BJP అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా అన్నారు. నీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక నెల క్రితం తీహార్ జైలు నుంచి మంత్రి అతిషికి లేఖ రాశారని గుర్తు చేశారు. గత నెల వ్యవధిలో సమస్య పరిష్కారానికి ఆమె ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.