నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ, మే 13న పోలింగ్ జరుగనుంది.