పోలీసుల ముందు నీట్-యూజీ పరీక్ష నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు తాజాగా బయటకు వచ్చాయి. బీహార్ ప్రభుత్వంలో జూనియర్ ఇంజినీర్గా పనిచేసే సికందర్ కుమార్ యదవేందు(56), నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులకు పరీక్షకు ఒకరోజు ముందే మే 4న ప్రశ్నాపత్రాలు అందాయని ఒప్పుకున్నాడు. విద్యార్థులకు ఈ ప్రశ్నలకు జవాబులను బట్టీ పట్టించారని, ఈ వ్యవహారం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.