2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటుడు, గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రవికిషన్ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మార్చే దిశగా ఈ బడ్జెట్ను పొందుపరిచినట్టు తెలిపారు.