మరో పోర్టును సొంతం చేసుకున్న అదానీ

63చూసినవారు
మరో పోర్టును సొంతం చేసుకున్న అదానీ
భారత్‌లోని ప్రైవేట్ పోర్టులను ఒక్కొక్కటిగా అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తూ వస్తోంది. కొన్నింటిలో అధిక వాటాలను కలిగి ఉంది. తాజాగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (ఏపీసెజ్) ఒడిశాలోని గోపాల్‌పూర్ పోర్టులో మేజర్ వాటాను కొనుగోలు చేసినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా రూ.3,350 కోట్ల విలువకు దీన్ని అదానీ గ్రూప్‌నకు విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్