బేల మండలం చాంద్ పల్లి గ్రామపంచాయతీలోని మారుతిగూడలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ కార్యక్రమంలో భాగంగా గిరిజనులకు వైద్య సిబ్బంది సోమవారం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వేసవికాలంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా. స్వామి, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.