బీజేపీ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందని, ఈ ఎన్నికలలో ఆ పార్టీకి సరియైన బుద్ధి చెప్పాలని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మాదిగ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. మాదిగలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం పట్ల కంది శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేసారు.