ఆదిలాబాద్ లోని భూక్తాపూర్ కు చెందిన అస్లం బిన్ మహమూద్ తన తల్లికి చికిత్స చేయుచటానికి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. శనివారం ఇంటి పక్క పొరుగు వారు ఫోన్ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పటంతో రాత్రి వచ్చి చూడగా ఎవరో ఇంటి తాళం పగలగొట్టి విలువైన బంగారు ఆభరణాలు, వెండి నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. ఆదివారం వన్ టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దొంగ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.