శ్రీరాముడు అందరివాడని కేవలం బీజేపీ కి మాత్రమే దేవుడు కాదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం జైనథ్ మండలంలోని పలు గ్రామాలలో పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికలలో ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ ల మధ్యే ఉంటుందన్నారు