తాండూర్ లో క్రికెట్ ఆడుతూ పూర్వ విద్యార్థి మృతి

81చూసినవారు
తాండూర్ లో క్రికెట్ ఆడుతూ పూర్వ విద్యార్థి మృతి
తాండూర్ మండలంలోని భారేవాడకు చెందిన రాచకొండ లక్ష్మీనారాయణ (38) క్రికెట్ ఆడుతూ అస్వస్థతకు గురి కావడంతో మంగళవారం స్పృహ తప్పి కింద పడిపోయాడు. తాండూరు మండలంలోని విద్యా భారతి పాఠశాలలో 1999 నుంచి 2012 వరకు చదువుకున్న విద్యార్థులు విద్యా భారతి బలగం పేరిట క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. కింద పడిపోయిన ఆయన్ని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.