ఇచ్చోడ మండలం దుబార్ పేట్ కు అయోధ్య రామయ్య అక్షింతలు చేరుకున్నాయి. మండల కేంద్రంలోని వీహెచ్పీ కార్యాలయం నుండి అక్షింతలకు స్వాగతం పలికేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తలపై అక్షింతలు పెట్టుకుని ఊరేగింపుగా గురువారం తీసుకెళ్లారు. అయోధ్య రామయ్య అక్షింతలు మోసేందుకు ఎంతో పుణ్యం చేసుకున్నామని కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో పుణ్యకార్యమని భక్తులన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.