మిషన్ భగీరథ నీటిపై అపోహాలు వద్దు

54చూసినవారు
మిషన్ భగీరథ నీటిపై అపోహాలు వద్దు
జిల్లా ప్రత్యేక అధికారి ప్రశాంత జీవన్ పాటిల్ శుక్రవారం గుడిహత్నూర్ మండలం డోంగర్గావ్, తోషం, పులిమడుగు , కుమ్మరి తండా గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి గ్రామ ప్రజలను త్రాగునీటి సరఫరా గూర్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ్రామాలలో అపోహలతో ప్రజలు మిషన్ భగీరథ నీటిని తాగడం లేదని తన దృష్టికి వచ్చిందని, మిషన్ భగీరథ నీటిని అందరూ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని వారు సూచించారు.